కామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ తో వ్యక్తి మృతి

కామారెడ్డిలో బ్లాక్ ఫంగస్ తో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా: రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన గురజాల అంజల్ రెడ్డి (42) బ్లాక్ ఫంగస్ తో మృతి చెందాడు. గత నెల 22న  జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన అంజల్ రెడ్డి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 23వ తేదీన నిజాంబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు.నిజామాబాద్ ఆస్పత్రిలోనే 12 రోజుల పాటు చికిత్స పొందిన అంజల్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తప్పనిసరి అని చెప్పి ఈనెల 11వ తేదీన అంజల్ రెడ్డి కి సంబంధించిన దవడ, కన్ను ను తొలగించారు వైద్యులు. అయినా ప్రయోజనం లేకపోయింది. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం చనిపోయాడు.