హైదరాబాద్ జీడిమెట్లలో మహిళ నింద మోపిందని అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్ జీడిమెట్లలో మహిళ నింద మోపిందని అవమానంతో వ్యక్తి ఆత్మహత్య

జీడిమెట్ల, వెలుగు: తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ వ్యక్తిపై మహిళ నింద వేయడంతో సదరు వ్యక్తి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం సీఐ సుధీర్​ కృష్ణ తెలిపిన ప్రకారం... కైసర్​నగర్​  డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లలో నివాసముండే  రాజు(55) బాలానగర్​లోని ఓ ప్రైవేట్​ కంపెనీలో పనిచేస్తున్నాడు. 

మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు. మెట్లు ఎక్కే టైంలో రాజు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ ఆరోపించింది. అంతటితో ఆగకుండా అర్ధరాత్రి 2 గంటలకు కొంతమందిని తీసుకొచ్చి రాజుతో గొడవ పడింది. దీంతో మనస్తాపానికి గురైన రాజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.