రైలు వెంట పరిగెత్తి వ్యక్తిని కాపాడిన పోలీస్

 రైలు వెంట పరిగెత్తి వ్యక్తిని కాపాడిన పోలీస్

హైదరాబాద్ : కదులుతున్న రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు కింద పడబోయిన ఓ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కాపాడాడు. ఈ ఘటన గురువారం నాంపల్లి రైల్వేస్టేషన్ లో చోటు చేసుకుంది.  చెన్నయ్ సెంట్రల్ నుండి హైద్రాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ (12759) లో గురువారం ఉదయం టి.వెంకట్ రెడ్డి (45) అనే ప్రయాణికుడు సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కాడు. ట్రైన్ నాంపల్లి చేరుకుంటుండగా కదులుతున్న ట్రైన్ నుండి దిగేందుకు వెంకట్ రెడ్డి ట్రై చేశాడు.

కాలు బ్యాలెన్స్ తప్పడంతో ట్రైన్ కింద పడబోయాడు. అక్కడే డ్యూటీ చేస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వికుల్ కుమార్ ఇది గమనించి వెంకట్ రెడ్డిను కింద పడకుండా పట్టుకొని ట్రైన్ తో పాటు పరగెత్తాడు. కొద్దీ దూరం వెళ్ళగానే అతన్ని ప్లాట్ ఫాం పైకి లాగడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుడికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అక్కడ ఉన్నవారు ఉపిరిపీల్చుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి ప్రాణాలు కాపాడిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ వికుల్ కుమార్ ను ఉన్నతాధికారులు అభినందించినట్లు ఎసై తెలిపారు.