కోహెడ (హుస్నాబాద్), వెలుగు : తన భూమిని కొన్న వ్యక్తి డబ్బులు ఇవ్వడం లేదని సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో గురువారం ఒకరు పోలీస్స్టేషన్వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కథనం ప్రకారం..అక్కన్నపేట మండలం గౌరవెల్లికి చెందిన బైరగోని తిరుపతి తన తల్లి పేరు మీదున్న 4 ఎకరాల 19 గుంటల భూమిని బంధువుకు అమ్మాడు. రూ.15 లక్షలు తీసుకొని మిగతా డబ్బులకు పేపర్ రాయించుకుని రిజిస్ట్రేషన్ చేశారు.
గడువు దాటినా డబ్బులివ్వకపోవడంతో పీఎస్లో ఫిర్యాదు చేశాడు. గురువారం పోలీస్స్టేషన్కు వెళ్లి స్పందించడం లేదంటూ పురుగుల మందు తాగాడు. అతడిని హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఎస్సై వివేక్ను వివరణ కోరగా 27న బాధితుడు పిర్యాదు చేశాడని, కొన్న వ్యక్తిని పిలిపించి మాట్లాడే క్రమంలోనే తిరుపతి ఇలా చేశాడని చెప్పారు.