ప్రాణాల మీదికి తెచ్చిన టిక్ టాక్

ప్రాణాల మీదికి తెచ్చిన టిక్ టాక్

టిక్ టాక్ తో ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. చివరకు గ్రామస్థుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. నీముచ్ మానస అనే గ్రామంలో పప్పు సింగ్ అనే యువకుడు నీటిలోకి దిగి టిక్ టాక్ వీడియో తీయాలనుకున్నాడు. దీంతో ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువలోని వరద నీటిలోకి దిగాడు. బయట ఉన్న తన ఫ్రెండ్స్ కు ఫోన్ తో వీడియో తీయమని చెప్పాడు. కాలువలోకి దిగిన ఆ యువకుడు వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొట్టుకు పోవడంతో పాటు మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని గమనించిన గ్రామస్తులు అతన్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.