- దొంగతనం కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టిన పోలీసులు
- పారిపోయేందుకు దూకగా తీవ్ర గాయాలు
- చికిత్స పొందుతూ మృతి
ఎంజీఎం, వెలుగు: వరంగల్మిల్స్ కాలనీ పోలీసుల హింస తట్టుకోలేక గత ఆదివారం అర్ధరాత్రి పీఎస్మొదటి అంతస్థు నుంచి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి గాయపడి చనిపోయాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బాధితుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వరంగల్ గాంధీనగర్లోని అబ్బనికుంటకు చెందిన దళితుడు కుమారస్వామి, కుమార్ఇల్లు షిఫ్టింగ్కార్మికులుగా పని చేస్తుంటారు. ఈ నెల ఆరో తేదీన ఓ ఇంటి సామగ్రి తరలించేందుకు వెళ్లారు. అదే రోజు సాయంత్రం ఇంటి యజమానులు తమ బంగారం పోయిందని వరంగల్లోని మిల్స్కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుమారస్వామితో పాటు కుమార్ను తీసుకువచ్చి ఇంటరాగేషన్మొదలుపెట్టారు. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పినా వినలేదు. తెల్లారి కూడా పోలీసులు వీరిని తమదైన పద్ధతిలో విచారించారు. పోలీసుల ట్రీట్మెంట్తో కుమారస్వామి కాళ్లు, ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. వారి దెబ్బలకు తట్టుకోలేక ఆదివారం అర్ధరాత్రి తప్పించుకోవడానికి పోలీస్ స్టేషన్మొదటి అంతస్తు పై నుంచి దూకాడు. కిందపడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని పోలీసులు వరంగల్ఎంజీఎం దవాఖానాకు తీసుకెళ్లగా, పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్దవాఖానాకు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు.
నిందితుల మధ్య గొడవతోనే ఇలా..
కుమారస్వామి మృతి విషయంలో పోలీసుల కథనం మరోలా ఉంది. ఆరో తేదీన దొంగతనం కంప్లయింట్ రావడంతో కేసు నమోదు చేసి కుమార్ తో పాటు మరో వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి విచారించామని వరంగల్ఏసీపీ గిరికుమార్చెబుతున్నారు. ఏడో తేదీన కుమార్, కుమారస్వామి మధ్య గొడవ జరిగిందని, దీంతో కుమారస్వామి స్టేషన్ బిల్డింగ్పై నుంచి దూకాడని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు. దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.