అడ్వెంచర్ గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయిండు

అడ్వెంచర్ గేమ్ ఆడి ప్రాణాలు కోల్పోయిండు

వికారాబాద్ సమీపంలోని రిసార్ట్స్ లో నిర్వాహకులు నిర్వహించిన డేంజర్ గేమ్ లో వ్యక్తి మృతి చెందాడు. నిర్వాహకులు ఒక దగ్గర దాచిపెట్టిన వస్తువును తీసుకొని రావడమే ఈ గేమ్ టార్గెట్. అందులో భాగంగా ఓ వస్తువును రిసార్ట్స్ నిర్వాహకులు  బావిలో దాచిపెట్టారు. దాన్ని వెతికి తీసుకువచ్చే క్రమంలో ఓ వ్యక్తి బావిలో దూకి, ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని గోధుమగూడలో జరిగింది. అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ ఈ ప్రోగ్రాంను నిర్వహించింది.

 

హైదరాబాద్ నుంచి నిన్న సాయంత్రం వంద మందికి పైగా యవకులు రిసార్ట్ కి చేరుకున్నారు. డేంజర్ గేమ్ నేపథ్యంలో రిసార్ట్ నిర్వాహకులు బావిలో వస్తువును దాచిపెట్టడంతో, సాయి కుమార్ అనే వ్యక్తి బావిలో దూకినట్టు తెలుస్తోంది. మృతి చెందిన వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని సమాచారం. అయితే ఘటన అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ పోగ్రాంను నిర్వహించేందుకు మూన్ లైట్ కు అనుమతి లేనట్టు తెలుస్తోంది. ఇదే తరహాలో వికారాబాద్ చుట్టూ పుట్టగొడుగుల్లా రిసార్ట్స్ విస్తరిస్తున్నట్టు సమాచారం.