పండంటి ఆడ‌బిడ్డకి జ‌న్మనిచ్చిన మ‌నాలీ రాథోడ్

పండంటి ఆడ‌బిడ్డకి జ‌న్మనిచ్చిన మ‌నాలీ రాథోడ్

గ్రీన్ సిగ్నల్, ఓ స్త్రీ రేపు రా, నేను లోకల్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌, హౌరా బ్రిడ్జ్‌, ఎంఎల్‌ఏ వంటి సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన హైదరాబాదీ అమ్మాయి మనాలీ రాథోడ్‌. ఆమె 2019 నవంబర్‌లో బీజేపీ లీడర్ విజిత్ వ‌ర్మను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది పెద్దలు కుదర్చిన ప్రేమ వివాహం. ఆ మ‌ధ్య కాలంలో మ‌నాలీ ప్రెగ్నెంట్గా ఉన్న ఫొటోలు సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మ‌నాలీ పండంటి ఆడ‌బిడ్డకి జ‌న్మనిచ్చింది. జూలై 18న ఆమెకి పాప‌ పుట్టగా. .ఈ విష‌యం ఆల‌స్యంగా సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వ‌చ్చింది. దాంతో మ‌నాలీకి అంద‌రూ కంగ్రాట్స్ తెలియ‌జేస్తున్నారు.