ఏటీపీ చాలెంజర్ ఫైనల్లో మానస్ ధమ్నే

ఏటీపీ చాలెంజర్ ఫైనల్లో మానస్ ధమ్నే

న్యూఢిల్లీ: భారత వర్ధమాన టెన్నిస్ ఆటగాడు మానస్ ధమ్నే సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు. కజకిస్తాన్‌‌‌‌‌‌‌‌లోని షిమ్కెంట్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఏటీపీ చాలెంజర్ టోర్నీలో శనివారం జరిగిన సెమీ ఫైనల్లో ఫ్రాన్స్​కు చెందిన ఆంటోయిన్ గిబాడోపై వరుస సెట్లలో విజయం సాధించి, కెరీర్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి ఫైనల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. క్లే కోర్ట్ టోర్నీలో భాగంగా జరిగిన ఈ పోరులో 18 ఏళ్ల మానస్ దూకుడుగా ఆడి గిబాడోను 6-4, 6-3 తేడాతో ఓడించాడు. 

తొలి సెట్‌‌‌‌‌‌‌‌లో ఆఖరి నిమిషంలో ప్రత్యర్థి సర్వీస్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్ చేసి ఆధిక్యం సాధించిన మానస్.. రెండో సెట్‌‌‌‌‌‌‌‌లో బేస్‌‌‌‌‌‌‌‌లైన్ వద్దే ఉండి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను సులువుగా ముగించాడు.  సోమవారం ప్రకటించే ర్యాంకింగ్స్‌‌‌‌‌‌‌‌లో అతడు టాప్-400లో ఉండే అవకాశం ఉంది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో బెల్జియంకు చెందిన బువాయ్‌‌‌‌‌‌‌‌సర్ గడమౌరీతో మానస్ తలపడనున్నాడు.