
వరంగల్, వెలుగు: దేశమంతా ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ఎమ్మార్సీఎస్ నేత మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందుకున్న తర్వాత తొలిసారిగా ఆయన శనివారం వరంగల్ వచ్చారు. వరంగల్ రైల్వే స్టేషన్లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మందకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాకే తమ జాతి ఫలితాలు పొందామన్నారు. ఎస్సీ వర్గీకరణలో మోదీ ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేర్చారన్నారు.
ఎన్నో త్యాగాల ఫలితమే విజయమని.. జాతి కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు దక్కిన పద్మశ్రీ గౌరవం అందరికి దక్కిన గౌరవంగా భావించాలన్నారు. తనకు అండగా నిలిచిన రాజకీయ పార్టీల నేతలకు, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎమ్మార్పీఎస్ శ్రేణులు వరంగ ల్ నుంచి హనుమకొండల వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో కృష్ణ మాదిగను ఘనంగా సన్మానించారు.