ఇంటి ముందున్న మొక్కను పీకిందని బాలికకు నిప్పంటించిన ఉన్మాదులు

ఇంటి ముందున్న మొక్కను పీకిందని బాలికకు నిప్పంటించిన ఉన్మాదులు

ఆడుకుంటూ వెళ్లి మొక్కను పీకిందని బాలికకు నిప్పంటించిన దారుణ ఘటన బీహార్‌లో జరిగింది. బెగుసారై జిల్లాలోని నింగా పంచాయతీలోని శివారానా గ్రామంలోని తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఒక బాలిక ఇంటి ముందున్న మొక్కను పీకిందని సికందర్ యాదవ్ అనే వ్యక్తి బాలికకు నిప్పంటించాడు.

బాలిక సికందర్ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా.. అనుకోకుండా ఒక మొక్కను పీకింది. అది గమనించిన సికందర్, అతని భార్య మరియు కుమార్తె ఆ బాలికను పట్టుకొని ఎందుకు మొక్కను పీకావని. ఆ తరువాత బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. గమనించిన స్థానికులు బాలిక కుటుంబసభ్యులకు చెప్పడంతో.. వెంటనే అక్కడకు వచ్చి మంటలు ఆర్పి బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సికిందర్ యాదవ్‌పై కేసు నమోదు చేశామని బెగుసారై డీఎస్పీ నిషిత్ ప్రియా తెలిపారు.