రేపు హైదరాబాద్​కు మాణిక్​రావు ఠాక్రే

 రేపు హైదరాబాద్​కు మాణిక్​రావు ఠాక్రే

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావు ఠాక్రే మంగళవారం హైదరాబాద్​ రానున్నారు. 2రోజులు ఇక్కడ ఉంటా రు. 4 రోజుల కింద చనిపోయిన పీసీసీ సోషల్​ మీడియా కో‑ఆర్డినేటర్​ సింధూ శంకర్​ కుటుంబాన్ని మంగళవారం పరామర్శిస్తారు. అదేరోజు సాయంత్రం పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​ జగదీశ్వర్​రావు కూతురు, మహారాష్ట్ర ఎమ్మెల్యే కైలాశ్ ​గోరంట్యాల్​ కుమారుడి వివాహ రిసెప్షన్​కు హాజరవుతారు. బుధవారం ఉదయం పార్టీ ఎస్టీ విభాగం చైర్మన్, జిల్లా ప్రెసిడెంట్లు, ఆఫీస్​బేరర్లతో భేటీ అవుతారని కాంగ్రెస్  పార్టీ ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం పార్టీ వైస్​ప్రెసిడెంట్లతో ‘హాత్​ సే హాత్​ జోడో’ యాత్రపై రివ్యూ చేస్తారని వెల్లడించింది. సాయంత్రం కిసాన్​ కాంగ్రెస్​ చైర్మన్, జిల్లా అధ్యక్షులు, ఆఫీస్​ బేరర్లతో భేటీ అయి గురువారం నాగ్​పూర్​ వెళ్తారు.