తక్కడపల్లి బీరప్ప ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు

తక్కడపల్లి బీరప్ప ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ పూజలు

రాయికోడ్, (మునిపల్లి), వెలుగు: మునిపల్లి మండలం తక్కడపల్లి గ్రామంలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో సోమవారం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కురుమ సంఘం నాయకులు మంత్రిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మండల కాంగ్రెస్​అధ్యక్షుడు సతీశ్​కుమార్​, మాజీ సర్పంచ్​మునీరా బేగంసర్దార్, మాజీ ఉప సర్పంచ్​సంగమేశ్వర్, మాజీ సర్పంచులు  సంగన్న, గొల్ల చంద్రన్న, ప్రభాకర్ పాటిల్,  గ్రామ పెద్దలు సంగన్న, విజయభూషణం, నజీర్, గొల్ల అంజన్న, శ్రీను పాల్గొన్నారు.

పుల్కల్: పుల్కల్ మండల కేంద్రంలో బీరప్ప జాతర సోమవారం ఘనంగా జరిగింది. ఈ జాతరకు మంత్రి దామోదర రాజనర్సింహా హాజరయ్యారు. అనంతరం బీరప్ప అలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్​ అధ్యక్షుడు దుర్గారెడ్డి, మన్నే విఠల్, గోవర్ధన్, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్, విక్రం, ఇమ్రాన్, రాజు తదితరులు ఉన్నారు.