
- బాధితులకు ఆపన్నహస్తం అందించాలి
హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్కు వ్యాక్సిన్ రూపొందించి మహమ్మారిని తరిమికొట్టాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం ఎక్స్ పో గెలాక్సియా ఆధ్వర్యంలో ది గుడ్ యాక్ట్ –2024 పేరుతో హైటెక్స్ లో క్యాన్సర్పై అవగాహన కల్పిస్తూ వాక్థాన్ నిర్వహించారు. ఇందులో ప్రముఖ డాక్టర్లు, వివిధ ఎంఎన్సీ కంపెనీల ఐటీ ఉద్యోగులు, టెలికాం ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫెలిసిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ డాక్టర్ చిన్నం రెడ్డి, డాక్టర్ ఉషా మాట్లాడుతూ.. క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడమే కీలకమని పేర్కొన్నారు.
వ్యాధిని నిర్మూలించడమే కాకుండా బాధితులకు ఆత్మస్థైర్యం కల్పించాలన్నారు. ఎక్స్ పో గెలాక్సియా ప్రతినిధులు రేఖా ముఖర్జీ, బెంగాలీస్ ప్రతినిధి పార్థా ప్రతిమ్ మల్లిక్, రామన్, వరల్డ్ తెలుగు ఐటీ సెల్ కౌన్సిల్ ప్రతినిధులు మాదాల సత్యనారాయణ, డిప్లొమాటిక్ కల్బ్ డాక్టర్ ఉషా, వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.