సీఎం కేసీఆర్‌తో పలు రాష్ట్రాల నేతల భేటీ

సీఎం కేసీఆర్‌తో పలు రాష్ట్రాల నేతల భేటీ

సీఎం కేసీఆర్ ను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు  చెందిన  ముఖ్యనేతలు  ప్రగతిభవన్ లో కలిశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నేషనల్ యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు గోపాల్ రిషికార్ భారతి, మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ మాజీ ఎంపీ బోధ్ సింగ్ భగత్, మహారాష్ట్ర బండారా మాజీ ఎంపీ కుషాల్ భోప్చే, ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి చబ్బీలాల్ రాత్రే, గడ్చిరోలి జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ పసుల సమ్మయ్య, రిపబ్లికన్ పార్టీ గడ్చిరోలి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ శంకర్ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం  బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖతగా ఉన్నట్లుగా తెలిపారు.