సికింద్రాబాద్, వెలుగు: విజయవాడ డివిజన్ పరిధిలో ట్రాక్ పనుల కారణంగా పలు రైళ్లను సోమవారం నుంచి ఈనెల12వ తేదీ వరకు రద్దు చేశారు. కాకినాడ పోర్ట్– -విశాఖపట్నం,- విజయవాడ- – విశాఖ పట్నం, మచిలీపట్నం- –విశాఖ పట్నం-– గుంటూరు-– రాయగడ- మధ్య నడిచే రైళ్లను రద్దు చేశామని,ఆయా రూట్లలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
దీపావళికి స్పెషల్ రైళ్లు
దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ మేరకు హైదరాబాద్– -కటక్ మధ్య దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లు నడుపుతుంది. ఈనెల 7,14,21 తేదీల్లో హైదరాబాద్– -కటక్, అలాగే 8,15, 22 తేదీల్లో కటక్ – -హైదరాబాద్కు స్పెషల్రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.