వారి నిబద్ధతకు నిదర్శనం.. గద్దర్ అవార్డులపై మోహన్ బాబు స్పందన

వారి నిబద్ధతకు నిదర్శనం.. గద్దర్ అవార్డులపై మోహన్ బాబు స్పందన

ఇకనుండి నంది అవార్డు(Nandi Awards)ల స్థానంలో  ప్రజా యుద్ధ నౌక గద్దర్(Gaddar) పేరిట రాష్ట్ర అవార్డులను అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై తాజాగా స్పందించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu). సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. తెలంగాణ సమాజం, సంస్కృతిని గుర్తించడంపై వారికున్న నిబద్ధతకు ఇదొక నిదర్శనమన్నారు.

గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడం అనేది జానపదాల ద్వార సమాజ మార్పు కోసం గద్దర్ చేసిన కృషి, త్యాగాలకు ఇచ్చే గొప్ప గౌరవమని, వ్యక్తిగతంగా ఇదొక గొప్ప అనుభూతి.. అంటూ రాసుకొచ్చారు మోహన్ బాబు. ఇంకా ఈ పోస్ట్ లో గద్దర్ కు శాలువా కప్పి సత్కరించిన ఫొటోను జత చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక మోహన్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తన కుమారుడు మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న కన్నప్ప సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో కూతురు మంచు లక్ష్మి చేస్తున్న అగ్ని నక్షత్రం సినిమాలో కూడా నటిస్తున్నారు మోహన్ బాబు. మరి ఈ రెండు సినిమాలు ఆయనకీ ఎలాంటి విజయాన్ని అందిస్తాయి చూడాలి.