
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో శనివారం మరో ఎన్కౌంటర్ జరగగా, ఓ మావోయిస్టు చనిపోయాడు. జిల్లాలోని మాంకేళీ అడవుల్లో కూంబింగ్ చేస్తున్న బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టు డెడ్బాడీతో పాటు ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మృతుడిని గుర్తించాల్సి ఉంది. శుక్రవారం గంగులూరు అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతులను గుర్తించినట్లు ఎస్పీ జితేంద్రయాదవ్ తెలిపారు. పొడియం హిడ్మా(34), మున్నా మడకం(25)గా గుర్తించారు. వీరిద్దరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు తెలిపారు.
స్మారక స్తూపం కూల్చివేత
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో శనివారం మావోయిస్టుల స్మారక స్తూపాన్ని జవాన్లు కూల్చివేశారు. పార్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పట్టేపూర్ అడవుల్లో కూంబింగ్ చేస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు 14 అడుగుల భారీ స్తూపాన్ని గుర్తించి నేలమట్టం చేశారు. గత ఏడాది ఎన్కౌంటర్లో చనిపోయిన కమాండర్ నగేశ్స్మారక స్తూపాన్ని మావోయిస్టులు నిర్మించారు.