మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అలియాస్ హెచ్బీ అలియాస్ లక్మాదాదా కరోనాతో చనిపోయాడు. గత కొంత కాలంగా కరోనాతో బాధపడుతున్న హరిభూషణ్ గుండెపోటుతో ఈ నెల 21న మృతి చెందాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. హరిభూషణ్ భార్య శారదతో సహా మరికొంతమంది అగ్రనాయకులు కరోన సోకి బాధపడుతున్నారని.. పోలీసులను ఆశ్రయిస్తే మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మడగూడకు చెందిన యాప నారాయణ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత విప్లవ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యారు.