మావోయిస్టుల లేఖలు కలకలం.. ప్రజాప్రతినిధుల ఆందోళన

మావోయిస్టుల లేఖలు కలకలం.. ప్రజాప్రతినిధుల ఆందోళన

జగిత్యాల జిల్లాలో ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరిట లేఖలు కలకలం రేపాయి. జిల్లాలోని బీర్పూర్ మండల సర్పంచులు, ఎంపీపీ, నరసింహుల పల్లి ఎంపీటీసీ, పలువురు ముఖ్య నాయకులకు మావోయిస్టుల పేరుతో లేఖలు వెల్లువడ్డాయి. ప్రజా ప్రతినిధులు తీరు మార్చుకోవాలని, లేకపోతే ప్రజా కోర్టులో హతమారుస్తామని లేఖల్లో పేర్కొన్నారు. ఈ లేఖలపై జగ్దళ్ పూర్ జిల్లా ఏరియా కమిటీ అని ముద్రించి ఉంది. 

గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ మావోయిస్టు కార్యదర్శి మల్లికార్జున్ పేరుతో లేఖలు ప్రచురించారు. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. అయితే నిజమైన మావోయిస్టు లే లేఖలు పంపారా.. లేక ఇది ఆకతాయిల నిర్వాకమా అన్న సందేహలు వ్యక్తం అవుతున్నాయి. ఈ లేఖల వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఆరా తీస్తున్నారు.