న్యూఢిల్లీ: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తూ ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాంకు వ్యవహారాలు సాగిస్తున్న తీరు డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని శుక్రవారం పేర్కొంది. బ్యాంకింగ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించింది. లైసెన్స్ రద్దు కావడంతో ఇకపై పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఎటువంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదు. బ్యాంకును పూర్తిగా మూసివేసే ప్రక్రియ (వైండింగ్ అప్) కోసం ఆర్బీఐ త్వరలోనే హైకోర్టులో దరఖాస్తు చేయనుంది. డిపాజిటర్లు అందరికీ వారి సొమ్మును తిరిగి చెల్లించడానికి సరిపడా నగదు నిల్వలు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వద్ద ఉన్నాయని ఆర్బీఐ వెల్లడించింది.

