మ్యాప్‌ మై ఇండియా యాప్‌లో కరోనా అప్‌డేట్స్‌

మ్యాప్‌ మై ఇండియా యాప్‌లో కరోనా అప్‌డేట్స్‌
  •  టెస్ట్‌ సెంటర్ల లొకేషన్లు
  • కేసుల వివరాలు కూడా

న్యూఢిల్లీ: మన దేశంలోని యూజర్లకు మ్యాప్‌మై ఇండియా సరికొత్త ఫీచర్‌‌ తెచ్చింది. ఆ యాప్‌ ద్వారా దగ్గర్లోని కరోనా టెస్టింగ్‌ సెంటర్ల వివరాలు, అడ్రస్‌ తెలుసుకునే సదుపాయం తీసుకొచ్చింది. అంతే కాకండా లొకేషన్‌ నేవిగేట్‌ చేసుకునే సదుపాయం కూడా ఇచ్చింది. దాంతో పాటు ఐసోలేషన్‌ సెంటర్లు, హాస్పిటల్స్‌, కేసుల వివరాలు కూడా అందిస్తున్నట్లు యాప్‌ నిర్వాహకులు చెప్పారు. అంతే కాకుండా ఆ యాప్‌ను మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌‌ వెబ్‌సైట్‌కు కూడా లింక్‌ చేశారు. దీంతో పూర్తి కేసుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. దీని కోసం యాప్‌లో ప్రత్యేకంగా ‘కరోనా’ అనే బటన్‌ను ప్రవేశపెట్టింది. లాక్‌డౌన్‌ వేళ టెస్టింగ్‌ సెంటర్ల కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా ఈ సుదుపాయం తీసుకొచ్చారు.