లాడ్జీలో మహిళతో పట్టుబడ్డ సీఐ

లాడ్జీలో మహిళతో పట్టుబడ్డ సీఐ

హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ సీఐ బాగోతం వెలుగులోకి వచ్చింది. మారేడ్పల్లి సీఐ నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పట్టుబడ్డాడు. వనస్థలిపురం లాడ్జిలో మహిళతో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. తన భార్యతో ఎఫైర్ పై ప్రశ్నించినందుకు సీఐ తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె భర్త ఆరోపించారు. మహిళ భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీఐపై అత్యాచారం, హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు.  

ఈ ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్..సీఐ నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు. అత్యాచారం, ఆయుధాల చట్టం కింద నమోదైన కేసులో దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సీఐని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బక్రీద్, బోనాల పండుగ నేపథ్యంలో కార్ఖానా డీఐ సీ నేతాజీని మారేడ్ పల్లి ఎస్హెచ్వో గా నియమించారు.