మరిపెడ, వెలుగు: ఆరేళ్ల నుంచి అద్దె ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఇంటి యజమానులు సోమవారం సాయంత్రం మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిల్డింగ్కు తాళం వేశారు. ఇంటి ఓనర్లు కాలం రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
ఆరేళ్ల కింద కింద మరిపెడ డిగ్రీ కాలేజీ కోసం కేయూ అధికారులు బిల్డింగ్ను అద్దెకు తీసుకున్నారు. ఆరేళ్ల నుంచి అద్దె అడుగుతున్నప్పటికీ రేపు, మాపు అంటూ కాలం వెళ్లదీస్తున్నారని, రూ.23 లక్షల బకాయి ఉందన్నారు.
అద్దె అడుగుతుండడంతో యూనివర్సిటీ అధికారులు ఆ బిల్డింగ్ ఖాళీ చేసి మరిపెడ జూనియర్ కాలేజీకి షిఫ్ట్ చేయాలని ఆదేశించారు. దీంతో ఇంటి ఓనర్లు కాలేజీకి చేరుకొని సిబ్బందిని నిలదీశారు. కాలేజీకి తాళం వేసి, అద్దె చెల్లించాక సామగ్రి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
