మార్కెట్లో మారుతీ జోరు : రికార్డు సేల్స్

మార్కెట్లో మారుతీ జోరు : రికార్డు సేల్స్

హైదరాబాద్, వెలుగు: మారుతీ కార్ల అమ్మకాలు జోరుమీదున్నాయి. కొత్త మోడల్స్ పై కన్నేసిన కస్టమర్లు వీటిని కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మారుతీ సుజుకీకి చెందిన కాంపాక్ట్ ఎస్‌‌యూవీ వితారా బ్రెజా మార్కెట్లోకి వచ్చిన మూడేళ్లలోనే 4 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. కాంపాక్ట్ ఎస్‌‌యూవీ విభాగంలో వితారా బ్రెజా మార్కెట్ వాటా 44.1 శాతం. 7 శాతం వృధ్ధితో నెలకు దాదాపు 14,675 కార్లు అమ్ముడవుతున్నట్లు మారుతీ తెలిపింది. వీటి సేల్స్ మరింత పెరిగేలా కనిపింస్తుందని తెలిపింది మారుతీ.