సంగారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం

సంగారెడ్డి జిల్లాలో భారీ సైబర్ మోసం

  రోజుకో చోట ఆన్ లైన్ ట్రేడింగ్ లో లక్షల్లో మోసపోతున్నారు. అధిక రిటర్న్స్  ఇస్తామని అమాయకులకు సైబర్ మోసగాళ్లు వల వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీ చెందిన బ్యాటరీల వ్యాపారం చేసే ఓ వ్యక్తి సోషల్ మీడియాలో లక్షలు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ లో వచ్చిన నకిలీ ట్రేడింగ్ లింకు ఓపెన్ చేసి తన వివరాలు నమోదు చేశాడు. అధిక కమిషన్ ఇస్తామని చెప్పిన కేటుగాళ్ల మాటలు నమ్మాడు. తన వివరాలతో ఒక ఐడి క్రియేట్ చేసి దఫాల వారీగా రూ. 41 లక్షల పెట్టుబడి పెట్టాడు. 

రూ. 94 లక్షల కమిషన్ చూపిన కేటుగాళ్లు మాయలో పడ్డాడు. ఆ మొత్తన్ని  డ్రా చేసుకునే సమయంలో ట్రేడింగ్ సంస్థ జెండా లేపింది. విత్ డ్రా సమయంలో సంస్థ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసి పోలీసులను ఆశ్రయించాడు.  కేసు నమోదు చేసుకున్న పటాన్ చెరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్ లైన్ మోసాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.