చెట్టును ఢీకొన్న కారు.. నలుగురి మృతి

చెట్టును ఢీకొన్న కారు.. నలుగురి మృతి
  • టపాసులు కొనేందుకు కారులో వెళ్తూ ప్రమాదం

కామారెడ్డి జిల్లా: తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామ శివారులో ఘోర రోడు ప్రమాదం జరిగింది. స్విప్ట్ డిజైర్ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో కారు నుజ్జు నుజ్జు అయింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక బాలుడు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. టపకాయలు కొనేందుకు కామారెడ్డి కి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు ఎల్లారెడ్డికి చెందిన జగన్, శ్రీను, ఆనంద్, శశాంక్(4)గా గుర్తించారు.