రైతన్నకు అండగా నిలిచిన పోలీసులు

రైతన్నకు అండగా నిలిచిన పోలీసులు

రైతన్నకు అండగా నిలిచారు మఠంపల్లి పోలీసులు. రఘునాథపాలెంలో మార్చి 31వ తేదీ శుక్రవారం జోరు వర్షం కురిసింది. ఈ క్రమంలో తడుస్తున్న  మిర్చి పంటను పట్టాలు కప్పుతూ కాపాడే ప్రయత్నం చేశారు పోలీసులు.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో ఎద్దుల పందాలు జరుగుతుండగా బందోబస్తుకు వెళ్లారు మఠంపల్లి పోలీసులు. ఆ సమయంలో అక్కడ ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. సమీపంలో వర్షంలో తడుస్తున్న మిర్చి పంటను చూసిన పోలీసులు చెలించిపోయారు. గాలి, వర్షం సైతం లెక్కచేయకుండా ఆ మిర్చి పంటను రైతులతో కలిసి కాపాడుతానికి ప్రయత్నం చేశారు పోలీసులు. మఠంపల్లి ఎస్ఐ రవి తన సిబ్బందితో వర్షంలో తడుస్తు పంటను కాపాడే ప్రయత్నం చేశారు. పోలీసులు చేసిన ఈ మంచి పనిని చూసిన జనాలు శభాష్ పోలీస్ అంటూ ప్రశంసించారు.