పరిసరాలు శుభ్రంగా ఉంచాలి : మయాంక్ మిత్తల్

పరిసరాలు శుభ్రంగా ఉంచాలి : మయాంక్  మిత్తల్

నారాయణపేట, వెలుగు: బాలసదన్ ను పరిశుభ్రంగా ఉంచి పిల్లలకు ఇంటి వాతావరణం కల్పించాలని అడిషనల్​ కలెక్టర్  మయాంక్  మిత్తల్ ఆదేశించారు. ఆదివారం పట్టణంలోని బాలసదన్, వృద్ధాశ్రమాలను సందర్శించారు.

బాలసదన్​లో వసతి ఏర్పాట్లను పరిశీలించారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు కల్పిస్తున్న సౌలతులు, భోజన వసతి ఏర్పాట్లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కల్పించే అన్ని సౌలతులు అందించాలని ఆదేశించారు. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేశారు.