సావిత్రి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలి : కొండూరు సత్యనారాయణ

సావిత్రి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించాలి : కొండూరు సత్యనారాయణ

ముషీరాబాద్, వెలుగు : చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతిని మహిళా టీచర్స్ డే గా  సీఎం రేవంత్ రెడ్డి గుర్తించాలని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జనవరి 3న ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. గురువారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. సమాజంలో వివక్షతకు గురైన స్త్రీలను చేరదీసి చదువు చెప్పిన గొప్ప వీరవనిత సావిత్రిబాయి పూలే అని కొనియాడారు.