మోదీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం

మోదీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం

మెదక్​టౌన్, వెలుగు: పీఎం మోదీకి మద్దతుగా ఆయన పోటీ చేస్తున్న ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో సోమవారం మెదక్​, నిజామాబాద్​, మేడ్చల్​ బీజేపీ నాయకులు ప్రచారం నిర్వహించారు. మెదక్​ బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​శ్రీనివాస్, నిజామాబాద్​అర్బన్​ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ, మేడ్చల్​జిల్లా ప్రెసిడెంట్​విక్రమ్​రెడ్డి, నాయకులు గజానంద్, జ్యోషి, మహేశ్, కరణం పరిణీత, వీణ వారణాసిలో ఉన్న తెలుగువారిని కలిసి బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు.

 అలాగే పదేళ్ల కాలంలో మోదీ చేపట్టినఅభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ తిరిగి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూడోసారి ప్రధానిగా మోదీ ఎన్నికవుతారని 400 సీట్లు సాధించి అద్భుతమన ఘనవిజయాన్ని సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.