
మేడ్చల్ కలెక్టరేట్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి పలువురు కార్యకర్తలతో కలిసి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డికామారెడ్డి నుంచి పోటీ చేయగా, నియోజకవర్గ ఇన్చార్జీలుగా ఉన్న తనతోపాటు కొండల్ రెడ్డి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఓడించారని ఆరోపించారు. సుమారు 600 మందికి పైగా సినిమా వాళ్లు, రాజకీయ నేతలు, జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్చేశారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.