హైదరాబాద్, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై మీడియా లీకులు సరికాదని కమలం పార్టీ సీనియర్నాయకురాలు విజయశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేవరకు బండి సంజయ్రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతారని గతంలోనే తరుణ్చుగ్ప్రకటించారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఇదే అధికారిక ప్రకటన అన్నారు. నాయకులు భేటీ అయితే దానిపై ఊహాగానాలతో మీడియాలో కథనాలు వెలువరిస్తున్నారు.
నాయకులు ఎలాంటి ప్రకటనలు చేయకున్నా ఇలా ప్రచారం చేయడం సరికాదన్నారు. మీడియాలో ప్రసారమయ్యే ఊహాజనిత కథనాల ప్రభావం పార్టీపై, ప్రజలపై ఎంతమాత్రం ఉండదన్నారు. పార్టీ అధికార ప్రతినిధులు ఇచ్చే సమాచారం మాత్రమే అధికారికమని స్పష్టం చేశారు.