హైదరాబాద్, వెలుగు: మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు చేసే ఇంటర్న్షిప్ గడువును మార్చి 2021 నుంచి మే 2021 వరకూ పొడిగిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా స్టూడెంట్లు ఇంటర్న్షిప్ క్లాసులకు అటెండ్ అయ్యేందుకు వీలు కాలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్ఎంసీ చెప్పింది. 2020లో ఇంటర్న్షిప్ ప్రారంభించిన స్టూడెంట్స్ వచ్చే ఏడాది మే చివరికల్లా ఇంటర్న్షిప్ పూర్తి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. కొత్త తేదీలకు అనుగుణంగా షెడ్యూల్స్ తయారు చేసుకోవాలని మెడికల్ కాలేజీలకు సూచించింది. ఇంటర్న్షిప్ పూర్తి చేయకుండానే, చేసినట్టుగా సర్టిఫికెట్లు ఇవ్వొద్దని ఎన్ఎంసీ హెచ్చరించింది.