
ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగంపేటలోని ప్రకాష్ నగర్లో నివాసముండే ఝాన్సీ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆమె గాంధీ ఆస్పత్రిలో పీజీ చదువుతుంది. ఝాన్సీ మృతికి గల కారణాల తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఝాన్సీ మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఝాన్సీ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
For More News..