
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 20 హైదరాబద్ లోని ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరగనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా డే కార్యక్రమం జరగనుంది. జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవం అయితే కౌంట్ డౌన్ గా 20 వ తేదీనే యోగ డే నిర్వహిస్తోంది రాష్ట్ర బీజేపీ. ఈ మేరకు ఎల్బీ స్టేడియంలో జరిగే యోగా డే లో ప్రతి ఒక్కరు పాల్గొవాలని సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తెలిపారు. చిరంజీవి వీడియోను కిషన్ రెడ్డి షేర్ చేశారు.చిరంజీవి ఏమన్నారంటే.. ప్రతి ఒక్కరు తప్పకుండా డైలీ యోగా చేయాలి. యోగా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు. మన ఆత్మ, శరీరం మన ఆధీనంలో ఉంటాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కౌంట్ డౌన్ గా అంటే జూన్ 20న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న యోగా కార్యక్రమానికి అందరూ పాల్గొనండి..యోగా చేద్దాం అందరూ ఆరోగ్యం ఉందాం జైహింద్. అని చిరంజీవి పిలుపునిచ్చారు.ప్రపంచానికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా అని.. జూన్ 21న అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని చిరంజీవి తన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సరిహద్దులు దాటి యోగాను సెలబ్రెట్ చేసుకుందామని చెప్పారు.