మెహిదీపట్నంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ శిబిరం..100 మందికి పైగా మహిళలకు పరీక్షలు

మెహిదీపట్నంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ శిబిరం..100 మందికి పైగా మహిళలకు పరీక్షలు

మెహిదీపట్నం, వెలుగు: దిగంబర్​ జైన్​ సోషల్​ గ్రూప్​, దిగంబర్​ జైన్​ సంస్థ ఆధ్వర్యంలో, ఎంఎన్​జే క్యాన్సర్​ హాస్పిటల్​ సహకారంతో ఆదివారం ఆగాపురాలోని మహావీర్ భవన్, దిగంబర్ జైన్ దేవాలయంలో బ్రెస్ట్​ క్యాన్సర్ ఉచిత స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికిపైగా మహిళలు పరీక్షలు చేయించుకున్నారు. ఎంఎన్‌‌‌‌‌‌‌‌జే క్యాన్సర్ హాస్పిటల్​ రేడియేషన్ ఆంకాలజీ నిపుణుడు డాక్టర్ వి.ఎస్.సాయి సంకల్ప్ నాయుడు, సదరన్​ జెమ్​ హాస్పిటల్​ 

గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేతా అగర్వాల్ శిబిరాన్ని ప్రారంభించారు. శరీరంలో కొత్తగా గడ్డలు ఏర్పడటం లేదా అసాధారణ రక్తస్రావం జరగడం క్యాన్సర్ సంకేతాలుగా పరిగణించాలని సూచించారు.