హైదరాబాద్: వచ్చే ఏడాది న్యూజిలాండ్ లో జరిగే మహిళల వన్డే వరల్డ్ కప్ నకు ఇండియా విమెన్ టీమ్ అర్హత సాధించడంపై వెటరన్ ప్లేయర్ మిథాలీ రాజ్ హర్షం వ్యక్తం చేసింది. లాక్ డౌన్ తో లాంగ్ బ్రేక్ వచ్చిందని చెప్పిన స్టార్ బాటర్.. ప్లేయర్లు మళ్లీ మొదట్నుంచి మొదలుపెట్టాలని తెలిపింది. ‘ట్రెయినింగ్ సెషన్స్ రద్దవడంతో అందరం ఇళ్లకే పరిమితమయ్యాం. ఇంట్లోనే ఉంటూ కొన్ని డ్రిల్స్ చేస్తున్నాం. కమ్ బ్యాక్ చేయడం కొంచెం చాలెంజింగ్ గా ఉంటుంది. టాప్ స్పాట్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టీమ్స్ తో మేం పోటీ పడుతున్నాం. మెంటల్ టఫ్ నెస్ పై ఎక్కువగా శ్రమించాల్సి ఉంది. ముఖ్యంగా వరల్డ్కప్స్ ఫైనల్ రౌండ్ లో ఒత్తిడిని ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాలి. రీసెంట్ గా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ లోనూ ఒత్తిడి కారణంగానే మా న్యాచురల్ గేమ్ ఆడటంలో విఫలమయ్యాం. ఇప్పటివరకు ఆడిన మూడు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ లోనూ ఇలాగే జరిగింది’ అని మిథాలీ పేర్కొంది. కరోనా కారణంగా పరిస్థితులు ఎంతగా విషమిస్తున్నాయో చూస్తున్నామని.. చాలా మంది ప్రజలు రోజు వారీ వేతనాలు, ఆహారం, నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పింది. 2017 వరల్డ్ కప్ తర్వాత అందరూ తమ పెర్ఫామెన్స్ ను గమనించడం మొదలుపెట్టారని.. ఆ టోర్నీ టర్నింగ్ పాయింట్ అని వివరించింది. ఆ ప్రపంచకప్ లో ఇండియా మహిళల జట్టు అద్భుత ఆటతీరుతో ఫైనల్స్ కు చేరింది. అయితే టైటిల్ ఫైట్ లో ఆతిథ్య ఇంగ్లండ్ చేతిలో 9 రన్స్ తేడాతో ఓడిపోయింది.
మెంటల్ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాలి: మిథాలీ రాజ్
- Telugu States
- April 17, 2020
లేటెస్ట్
- PBKS vs RCB: పంజాబ్ను మట్టికరిపించిన బెంగళూరు.. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం
- కాంగ్రెస్ లో చేరిన అజ్మీరా ఆత్మారాం నాయక్
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు
- దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ మోదీ రావాలె : తమిళిసై సౌందరరాజన్
- వచ్చి ఉద్యోగంలో చేరండి..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా పిలుపు
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- PBKS vs RCB: చితక్కొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. పంజాబ్ టార్గెట్ 242
- కూటమికి చెక్ చెప్పేలా జగన్ ప్లాన్.. ప్రచార షెడ్యూల్లో మార్పు..
- OMG : ఆ అడవి మొత్తం శవాలే.. గుట్టలుగా పడి ఉంటాయి.
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?