గణనాథుల​ శోభాయాత్ర : అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీసులు

గణనాథుల​ శోభాయాత్ర : అర్ధరాత్రి వరకు మెట్రో  సర్వీసులు

తెల్లవారుజాము వరకు ఎంఎంటీఎస్ సర్వీసులు

గురువారం రాత్రి 11 గంటల నుంచి శుక్రవారం 4.40 గంటల వరకు ఎంఎంటీఎస్  ప్రత్యేక సర్వీసులను సౌత్ సెంట్రల్ రైల్వే నడుపనుంది. హైదరాబాద్– లింగంపల్లి, సికింద్రాబాద్– హైదరాబాద్, లింగంపల్లి – ఫలక్ నుమా మధ్య మొత్తం 8 ఎంఎంటీఎస్ రైళ్లు తెల్లవారుజాము వరకు సేవలందించనున్నాయి.

ఆర్టీసీ.. 535 స్పెషల్ బస్సులు

నిమజ్జనం, శోభాయాత్ర నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ 535 స్పెషల్ బస్సులను నడుపనుంది. జీహెచ్​ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బస్సుల సమాచారం కోసం రెతిఫైల్ బస్ స్టేషన్​ నం. 9959226154, కోఠి బస్ స్టేషన్​నం. 9959226160ను సంప్రదించాలి.

అర్ధరాత్రి వరకు మెట్రో  సర్వీసులు

గణనాథుల​ శోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా గురువారం ఉదయం  6 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైల్ సర్వీసులు నడుపనున్నట్లు హైదరాబాద్ మెట్రో పేర్కొంది. చివరి రైలు అర్ధరాత్రి ఒంటిగంటకు బయలుదేరి 2 గంటలకు డెస్టినేషన్​కు చేరుకుంటుంది.