
హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలోని ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్స్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మెట్రోవాటర్బోర్డు ఈడీ మయాంక్ మిట్టల్ మంగళవారం సందర్శించారు. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ నీటిని ఈ ప్లాంట్లోనే శుద్ధి చేస్తారు. అతి పురాతనమైన ఫిల్టర్స్ నిజాం హయాంలో నిర్మించారు. అప్పటి నుంచి ఇంకా ఈ ఫిల్టర్స్ నగరానికి సేవలు అందిస్తోంది. ఈ సందర్భంగా క్లోరిన్ ప్లాంట్, ఫిల్టర్ బెడ్ లను పరిశీలించిన ఈడీ, ల్యాబ్లోని నీటి నాణ్యత పారామీటర్లను తనిఖీ చేశారు.
వర్షాకాలం నేపథ్యంలో నీటిశుద్ధి ప్రక్రియలో వినియోగించే రసాయనాలను సకాలంలో కొనుగోలు చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈడీ వెంట టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, ట్రాన్స్మిషన్ సీజీఎం బ్రిజేష్, క్యూఏటీ జీఎం శ్రీనివాస్ ఇతర అధికారులు ఉన్నారు.