- కాంగ్రెస్ నేత రాజశేఖర్రెడ్డి ఫైర్
వికారాబాద్, వెలుగు : సీఎం రేవంత్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్కు లేదని కాంగ్రెస్ వికారాబాద్ మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి మెతుకు ఆనంద్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్చేశారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలన్నారు.
