బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉంది

బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉంది

బాలసుబ్రమణ్యం ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉందని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలుకు కరోనా నెగిటివ్ వచ్చిందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ రోజు ఉదయం చెప్పిన విషయాన్ని వైద్యులు ఖండించారు. దాంతో ఎస్పీ చరణ్ కూడా ఒక వీడియో మెసెజ్ ను విడుదల చేశారు. ‘నాన్నకు కరోనా పాజిటివ్ లేదా నెగిటివ్ అనే విషయాన్ని పక్కనపెడితే.. ఆయన ఇంకా ఎక్మో సపోర్ట్ తోనే చికిత్స పొందుతున్నారు. ఉదయం నేను తెలిపిన హెల్త్ బులెటిన్ కు ఆస్పత్రి వర్గాలకు ఎటువంటి సంబంధం లేదు. నాన్న హెల్త్ గురించి మొదటగా నేనే అప్డేట్ చేస్తాను. సోషల్ మీడియాలో వచ్చేవన్ని రూమర్లే’ అని ఆయన తెలిపారు. వైద్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం బాలు హెల్త్ గురించి అప్డేట్ చేస్తానని ఎస్పీ చరణ్ తెలిపారు.

For More News..

20 వేలమందికి ఉపాధితో పాటు వసతి కల్పించిన సోనూసూద్

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు

తెలంగాణలో మరో 1,842 కరోనా కేసులు