భారత్‌లో 200 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసుల పూర్తిపై బిల్ గేట్స్ ట్వీట్

భారత్‌లో 200 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసుల పూర్తిపై బిల్ గేట్స్ ట్వీట్

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌..  దేశ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత్‌లో 200 కోట్ల వ్యాక్సినేషన్‌ డోసుల ప్రక్రియ పూర్తయిన సందర్భంగా బిల్‌గేట్స్‌ అభినందించారు. దీనికి సంబంధించిన ఓ వార్త కథనాన్ని ట్యాగ్‌ చేసి మరీ ట్విటర్‌లో మోడీకి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. భారత వ్యాక్సిన్‌ తయారీదారులతో భాగస్వామ్యం కొనసాగింపుపైనా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. కొవిడ్-19 ప్రభావాన్ని తగ్గించినందుకు భారత వ్యాక్సిన్ తయారీదారులు, భారత ప్రభుత్వంతో మా నిరంతర భాగస్వామ్యాన్ని గొప్పగా భావిస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ప్రధాని మోడీ భారత్‌ మరో చరిత్ర సృష్టించిందంటూ వ్యాక్సినేషన్‌పై ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా మళ్లీ కరోనా కేసుల పెరుగుల నేపథ్యంలో బూస్టర్‌ డోసులను సైతం ఉచితంగా అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ప్రస్తుతం అన్ని రాష్ట్రా్ల్లోనూ బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్నాయి.