- కేటీఆర్.. రాజకీయాల్లో నిన్న , మొన్న కండ్లు తెరిచిన చిలుక
- మాకు గద్దెనెక్కించడం తెలుసు, దించేయడమూ తెలుసు
- రాజకీయం మా ఇంటి గుమాస్తాతో సమానం
- మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: మజ్లిస్ పార్టీ తలుచుకుంటే రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయగలదని ఆ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ చీఫ్అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్లు రాజకీయం తమ ఇంటి గుమాస్తాతో సమానమన్నారు. మంత్రి కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లో కండ్లు తెరిచిన చిలుక అని, అలాంటి వాళ్లు తమకు లెక్క కాదని ముంతాజ్ అహ్మద్ ఖాన్ చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం చార్మినార్ లోని పలు డివిజన్లలో ఆయన ప్రచారం నిర్వహించారు. ‘‘మజ్లిస్ ఎంతో మందిని చూసింది. మాకు సీట్లో కూర్చొబెట్టడం తెలుసు.. సీట్లో నుంచి దించడమూ తెలుసు. మాకు ఇదేం కొత్త కాదు. ఈ రోజు తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చగలం” అని హెచ్చరించారు.