
వంతెనపై నుంచి మినీ బస్సు పడడంతో ఐదుగురు మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం మహారాష్ట్రలో జరిగింది. సాతారా జిల్లాలో 50 అడుగుల ఎత్తున్న వంతెనపై నుంచి మినీ బస్సు పడడడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి ఉన్నారని తెలిపారు. ముంబై నుంచి గోవా వెళ్తుండగా పూణె-బెంగళూరు హైవేపై బస్సు అదుపుతప్పడంతో ప్రమాదం జరిగిందన్నారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గాయాలపాలైన వారిని సహాయక బృందాలు ఆసుపత్రులకు తరలించి, ట్రీట్ మెంట్ అందిస్తున్నారని తెలిపారు పోలీసులు.