
- రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తిమ్మాపూర్, వెలుగు: మాదిగలకు సేవచేసే విషయంలో అందరికంటే ముందుంటానని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖా మంత్రి అల్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. మండలంలోని అల్గునూర్లోని ఏఎంఆర్ ఉన్నతి కన్వెన్షన్లో మాదిగ అఫీషియల్, ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన కాలంలో తాను పాలకుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్నారు.
ఇప్పుడు మీ అందరి ఆశీస్సులు, సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మంత్రిని అయ్యానన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. మాదిగ అని చెప్పుకోలేని స్థితి నుంచి మాదిగ అని గర్వంగా చెప్పేస్థాయికి చేరుకోవడం శుభ పరిణామన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మాట్లాడుతూ.. జాతీయ ఉద్యమంలో మాదిగల పాత్ర ఘనమైందన్నారు. ప్రొఫెసర్ చింతకింది ఖాసీం, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, సోమన్న తదితరులు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
గొల్లపల్లి, వెలుగు: పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో 46 మందికి కళ్యాణ లక్ష్మి, 117 మందికి రూ.38 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి ఆదివారం పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు నిశాంత్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంతోష్, వైస్ చైర్మన్ రాజిరెడ్డి,స్పెషల్ ఆఫీసర్ కిశోర్, ఎంపీడీఓ రాంరెడ్డి, తహసీల్దార్ వరందన్ తదితరులు పాల్గొన్నారు.