
- కేంద్రమంత్రి రాందాస్కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల భవిష్యత్ను మెరుగుపరచేందుకు ప్రభుత్వం ‘‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’’ ప్రాజెక్టును చేపట్టిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఒక్కో స్కూల్ను రూ.200 కోట్లతో నిర్మించేలా 55 పాఠశాలల నిర్మాణానికి ఆమోదం లభించిందన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్న ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించాల్సిందిగా కేంద్ర సోషల్జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్మంత్రి రాందాస్ అథావాలేకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బేగంపేట టూరిజం ప్లాజాలో ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్ క్షితిజ, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణితో కలిసి మంత్రి అడ్లూరి కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు.