 
                                    హైదరాబాద్: నాకు మంత్రి పదవి ఇవ్వడంపై కొందరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు..మంత్రి పదవికి , జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధం లేదు అన్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్.. గత కొంత కాలంగా నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
కేంద్ర మంత్రి కిషన్ ఏదేదో మాట్లాడుతున్నరు.. నా దేశ భక్తి గురించి ఆరోపణలు చేస్తున్నారు.. కిషన్ రెడ్డికి నాపై పూర్తి అవగాహన లేదు.. నాపై కేసులున్నాయంటున్నారు అవి ఎక్కడా నిరూపితం కాలేదు. ఎవ్వరి సర్టిఫికెట్ నాకు అవసరం లేదన్నారు అజారుద్దీన్.
కేబినెట్ చోటు కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు , రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ఖర్గేలకు కృతజ్ణతలు చెప్పారు అజారుద్దీన్.జూబ్లీహిల్స్ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడమే నా తక్షణ కర్తవ్యం అన్నారు నూతన మంత్రి అజారుద్దీన్.

 
         
                     
                     
                    