కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలంలోని కాట్రపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్కు పర్యావరణ పరిరక్షణ అంటే ఎంతో ఆసక్తి. అందుకే కేసీఆర్ బర్త్డే సందర్భంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాం. కాట్రపల్లిలో పురాతన ఎల్లమ్మ, నాగేంద్ర స్వామి ఆలయాలను పునర్నిస్తాం. అతి త్వరలోనే గౌరెల్లి ప్రాజెక్టు నుంచి పంట పొలాలకు నీరు అందిస్తాం’ అని మంత్రి ఈటల అన్నారు.
For More News..