ప‌ల్లెల్లో కరోన వైరస్ వ్యాప్తి చెందక‌పోవ‌డానికి కార‌ణ‌మిదే

ప‌ల్లెల్లో కరోన వైరస్ వ్యాప్తి చెందక‌పోవ‌డానికి కార‌ణ‌మిదే

కరీంనగర్: గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి కంటే… టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధీనంలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రజలు ఒకసారి గమనించాలన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. సోమవారం పల్లె ప్రగతి లో భాగంగా జగిత్యాల రూరల్ నర్సింగపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… పల్లెప్రగతి వలన పల్లెల్లో చాలా అభివృద్ధి జరిగిందని…దీనితో కరోన వైరస్ వ్యాప్తి చెందలేదని అన్నారు. ప్ర‌జలు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని… వర్షాకాలంలో కరోనా తొందరగా వ్యాపి చెందుతుంది కాబట్టి జాగ్రత్తగా వుండాలని సూచించారు.

”రైతులు ఇబ్బంది పడొద్దనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.30 వేల కోట్లు పెట్టి వడ్లు కొనుగోలు చేస్తున్నారు.గతంలో కరెంటు, ఎరువుల కోసం ధర్నాలే కనపడేవి ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి.రైతులు ఈ కరోనా సమయంలో ఇబ్బంది పడొద్దు అని ముఖ్యమంత్రి రూ.7000 కోట్ల అప్పు తెచ్చి రైతుబంధు ఇచ్చారు.అన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎన్ని నిధులు కావాలో అన్ని సమకూర్చుతా పనులు చేయించుకోండి” అని మంత్రి ఎర్రబెల్లి హామీ ఇచ్చారు.

minister errabelli dayakar rao comments at jagtial district